• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాయలసీమ – సిఎం చంద్రబాబు

admin by admin
October 1, 2024
in politics
0 0
0
గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాయలసీమ – సిఎం చంద్రబాబు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

పత్తికొండ నియోజకవర్గం, పుచ్చకాయలమాడ గ్రామంలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

‘రాయలసీను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చుతాం. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా రాయలసీమ ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తాం. వచ్చే దీపావళి పండుగ నుండి సూపర్ 6 పథకాల్లో భాగమైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసి మీ ఇంట్లో దీపం వెలిగిస్తాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకర్గం, పుచ్చకాయలమాడలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పింఛను అందించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్ల అందజేత

ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్లు రూ.4 వేలు అందిస్తున్నాం. ఎన్టీఆర్ తొలిసారి రూ.35లతో పింఛన్లను ప్రవేశపెట్టారు. 1996లో నేను రూ.75కు పెంచాను. 2014లో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక 200 ఉన్న పింఛన్ ను వెయ్యి రూపాయలకు పెంచి తర్వాత రూ.2 వేలు చేశాను. కానీ గత ప్రభుత్వం సంవత్సరానికి రూ.250 చొప్పున వెయ్యి పెంచడానికి 5 ఏళ్లు సమయం తీసుకుంది. పెన్షన్లను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం మొత్తం ఒకటో తేదీ ఉదయమే పేదల సేవలో నిమగ్నం అయ్యేలా చర్యలు తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారులకు 12,580 కోట్లు చొప్పున సంవత్సరానికి 34 వేల కోట్ల రూపాయల పెన్షన్లను పేదవారికి పంచి వారి మొములలో చిరునవ్వులు చూస్తున్నాం. గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు.. చెట్లు కొట్టేసేవారు. గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేది’ అని అన్నారు.

ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం

‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంతో పాటు ఆర్థిక అసమానతలను తగ్గించడానికి కృషి చేస్తున్నాం. పెన్షన్ల తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు సక్రమంగా ఇస్తున్నాం. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.. వంద రోజుల ప్రణాళికలో అనేక కార్యక్రమాలు చేపట్టి లక్ష్యాలు సాధించాం. ప్రతి కుటుంబానికి అండగా ఉండి జీవన ప్రమాణాలు పెంచి మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. 15 రూపాయలకే టిఫిన్ తో పాటు రెండు పూటలా భోజనమును ఇచ్చి పేదవాడి కడుపు నింపుతున్నామన్నారు. యువత నైపుణ్యానికి పదును పెట్టి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ సెన్సెస్ సెంటర్లను కూడా నెలకొల్పుతాం. 1995లో తాను సమైక్య ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశా. ఇదే తరహాలో ఆంధ్ర రాష్ట్రానికి పూర్వయోగం తీసుకొచ్చేందుకు అందరి సహకారంతో కృషి చేస్తా. 1995 తరహా లోనే ప్రస్తుతం కూడా అధికారులను, రాజకీయ నాయకులను పరుగులు పెట్టించి పనులు చేయిస్తా అని అన్నారు.

గత పాలకుల తప్పులు…ఇప్పుడు శాపాలు

‘నేను సీఎంగా బాధ్యతలు తీసుకునే నాటికి ఖజానాలో చిల్లి గవ్వలేదు. రూ.10 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇందుకు ప్రతినెలా లక్ష కోట్ల రూపాయల వడ్డీని చెల్లిస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ వినూత్న ఆలోచనలతో బయటపడే పరిస్థితికి రావడానికి ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వ పాలకుల తప్పులు ఇప్పుడు శాపాలుగా మారాయి. పత్తికొండ ప్రాంతంలో హంద్రీనీవా ప్రధాన కాలువ నుండి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రాజెక్టు పనులు ప్రారంభించి పూర్తి చేసినప్పటికీ గత ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. వేదవతి, గురు రాఘవేంద్ర, కెసి కెనాల్, గుండ్రేవుల ప్రాజెక్టులను అభివృద్ధి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే హంద్రీ నీవా నీళ్ళు పుచ్చకాయలుమాడ గ్రామానికి ఇస్తాం’ అని సీఎం హామీ ఇచ్చారు.

90 శాతం రాయితీతో డ్రిప్

‘డ్రిప్ సౌకర్యం ద్వారా 90 శాతం సబ్సిడీతో బిందు, తుంపర్ల సేద్య పరికరాలను రైతులకు మళ్ళీ ఇస్తాం. ధాన్యం రైతులకు రూ.1670 కోట్లు గత ప్రభుత్వం అప్పు పెడితే మేము వచ్చి వాటిని చెల్లించట రైతాంగాన్ని ఆదుకున్నాం. వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతాఇంతా కాదు. గత ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించడంలో నిర్వీర్యం అయిందని..ప్రస్తుతం అధికారులతో సమర్ధవంతంగా పనిచేయిస్తున్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు డిసెంబర్ నెల ఆఖరుకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. అవి పూర్తయిన వెంటనే కొలువులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. చదువుకున్న నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నాం. యువత ఆసక్తి మేరకు సంబంధిత రంగాలలో నైపుణ్యం గల శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో 7 లక్షల 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో 50% సమస్యలు భూ సంబంధిత సమస్యలే నాకు అర్జీల రూపంలో వస్తున్నాయి. వీటిని తెరదించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశాం. ప్రజల భూముల సరిహద్దులు చెరిపేశారు.. వాటిని సరిచేస్తున్నాం. భూములు అన్నింటినీ రీ సర్వే చేయించి ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం’ అని అన్నారు.

గుండ్రేవుల, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

‘ఉచిత ఇసుకను ఈనెల 15 నుండి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. స్థానికంగా అవసరాలు తీర్చేందుకు నదులు, వాగుల్లో ఉన్న ఇసుకను మీరే సొంతంగా తీసుకెళ్లొచ్చు. పోలవరం పనులను మళ్లీ ప్రారంభించి పూర్తి చేయడంతో పాటు కృష్ణా డెల్టాలకు నీళ్లను తీసుకువచ్చి అక్కడి నుండి శ్రీశైలం తద్వారా రాయలసీమకు ప్రాంతానికి కరువు సమస్య లేకుండా చూస్తాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్ లో గేటు కొట్టుకుపోతే ఇక్కడి నుండే పర్యవేక్షించి మంత్రులను, అధికారులను మన రాష్ట్రంలో నిపుణులైన ఇంజనీర్ కన్నయ్య నాయుడును అక్కడికి పంపించి గేటును పునరుద్దించడంతోపాటు నీళ్లను వృధా కాకుండా వినియోగించుకునే పరిస్థితి తీసుకొచ్చాం. పెండింగ్ లో ఉన్న గుండ్రేవుల, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

ఇండస్ట్రియల్ హబ్ గా ఓర్వకల్లు

‘కర్నూలు నుండి బళ్లారి వరకు జాతీయ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. కర్నూలు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు హైకోర్టు బెంచ్ ను కూడా ఏర్పాటు చేస్తాం. కర్నూలు నగరాన్ని చక్కటి నగరంగా చేయడమే గాక పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తాం. ఒర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్ గా మార్చుతాం. నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చి కల్తీ మద్యాన్ని అరికట్టాం. మద్యం విధానంలో శెట్టిబలిజ, ఈడిగ, గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండేందుకు స్వర్ణాంధ్ర@2047 ప్రణాళిక తీసుకొస్తున్నాం. తెలుగువారు ముందు ఉండాలన్నదే నా లక్ష్యం. టెక్నాలజీ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి పరిష్కరించే దిశలో ప్రయత్నిస్తామన్నాం’ అని అన్నారు.

పంచాయతీలకు మహర్ధశ

‘ఒకే రోజున 13,380 గ్రామసభలు నిర్వహించిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 4,500 కోట్ల రూపాయలతో పనులు మంజూరు చేసి ప్రారంభించాం. గత ప్రభుత్వం రూ.990 కోట్ల రూపాయల పంచాయతీ నిధులను మళ్ళిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక విడుదల చేశాం. దీంతో కేంద్రం ప్రభుత్వం నుండి 1200 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కేంద్రం వాటా ఇస్తోంది. రాష్ట్ర వాటా నిధులు కేటాయించి ఇంటింటికీ కుళాయి ద్వారా 3 ఏళ్లలో నీరు ఇస్తాం. ప్రతి ఇంటికీ కరెంట్, కుళాయి, సిలిండర్, టాయిలెట్ ఉండాలి. ఇళ్లు లేనివారికి సొంతిల్లు కట్టి ఇస్తాం. రాయలసీమలో చిన్న పరిశ్రమలను ప్రోత్సాహిస్తాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

Previous Post

రాజమౌళి కారణంగా తెలుగు టెక్నీషియన్స్‌కి గౌరవం పెరిగింది: అజయ్‌ పట్నాయక్‌

Next Post

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Next Post
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్
movies

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

by admin
July 10, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In