• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఏపీలో పెట్టుబడులపై టీడీపీ ఎంపీ ప్రశ్న… పార్లమెంట్ లో టీడీపీ పరువు పాయె

admin by admin
July 23, 2023
in politics
0 0
0
ఏపీలో పెట్టుబడులపై టీడీపీ ఎంపీ ప్రశ్న… పార్లమెంట్ లో టీడీపీ పరువు పాయె
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

* రికార్డు స్థాయిలో వస్తున్నాయని లెక్కలతో సహా కేంద్రం సమాధానం

ఆంధ్రప్రదేశ్‌లో మన పెత్తందార్ల, దోపిడీ ప్రభుత్వం లేదు కాబట్టి అభివృద్ధి .. ప్రగతి ఇవన్నీ లేకుంటే బాగుణ్ణు.. ఏదైనా చేస్తే మనమే చేయాలి.. వేరే పార్టీ వాళ్ళు అది కూడా మనం ఎంతాగానో ప్రయాసపడి బదనాం చేయాలనీ ప్రయత్నిస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వం ఉన్నపుడు రాష్ట్రానికి అసలు మంచి జరగకూడదు. మనం లేనపుడు రాష్ట్రం మొత్తం మట్టిగొట్టుకుని పోవాలి.. ఉంటే మనం ఉండాలి.. పొతే రాష్ట్రం పోవాలి.. ఇదీ టీడీపీ వాళ్ళ ఆలోచన. అందుకే ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న లోపం… పొరపాటు దొరికినా దాన్ని పట్టుకుని పెద్దది చేసి, మన సొంత పత్రికల్లో వేసి, జగన్‌తో పాటు రాష్ట్రం పరువు తీసిపారేయాలని తపించే తెలుగుదేశం వారి ఆశలు సాక్షాత్తూ రాజ్యసభ సాక్షిగా నిరాశగా మారాయి.

ఆంధ్రాలో విదేశీ పెట్టుబడులు ఘోరంగా తగ్గిపోయినాయ్ అట కదా అంటూ లోలోన సంతోష పడుతూ రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అత్యుత్సాహంతో వేసిన ప్రశ్నకు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ
సహాయమంత్రి సోమ్ ప్రకాష్ సమాధానం ఇచ్చారు. దెబ్బకి టీడీపీ ఎంపీ బిక్కమొహం వేశాడు.

2019 అక్టోబర్ – 2020 మార్చ్ మధ్య : 200.97 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయి
2020- 21 : 85.85 మిలియన్ డాలర్లు
2021-22 : 224.96 మిలియన్ డాలర్లు
2022-23 : 284.22 మిలియన్ డాలర్లు

ఇలా ఏటా ఏపీలో పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయని లెక్కలతో కూడిన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజా జీవనం స్థంభించిపోగా ఆ ప్రభావం వలన 2020-21 మధ్య మాత్రం పెట్టుబడుల్లో క్షీణత ఉంది. ఆ కొద్దికాలం దాటగానే ఆంధ్రాలో మళ్ళీ పెట్టుబడుల వరద మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రికార్డ్ స్థాయిలో 2022- 23లో 284.22 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు రావడం అంటే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దక్షతకు నిదర్శనం అని చెప్పకనే చెప్పారు.

*సందర్భం వచ్చిన ప్రతిసారీ ఇదే తీరు* …

ఇదే కాదు.. రాష్ట్రం అధోగతి పాలవ్వాలని, దాన్ని చూస్తూ పండగ చేసుకోవాలని ఎదురుచూసే తెలుగుదేశం నాయకుల ఆశల మీద సీఎం వైయస్ జగన్ తరచూ నీళ్లు పోస్తూనే ఉన్నారు. మొన్న మార్చిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సును సైతం ఇలాగే చిన్నచూపు చూసిన తెలుగుదేశం అక్కడి సదస్సును, నిర్వహించే విధానాన్ని, దానికి హాజరైన పారిశ్రామికవేత్తలను చూసి వారం రోజులు కంటికిమింటికి ధారాపాతంగా ఏడ్చింది.

మనం కదా దావోస్ లాంటి సదస్సులకు వెళ్లి పెట్టుబడులు తెస్తాం… ఈ ప్రభుత్వం వళ్ళ అవన్నీ అయ్యేవా అంటూ గోతికాడ నక్కల్లా కూర్చున్న వాళ్ళ కళ్ళలో దుమ్మురేగేలా లక్షల కోట్ల పెట్టుబడులతో సదస్సు ముగిసింది. అంబానీ, అదానీ, బిర్లా, భజంకా ఇలాంటి చాలా పారిశ్రామిక సంస్థలు వచ్చి ఆంధ్రప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల, పరిశ్రమల ఏర్పాటు పట్ల చూపుతున్న శ్రద్ధను కొనియాడడం టిడిపికి, దాని అనుకూల మీడియాకు కంటిమీద కునుకులేకుండా చేసాయి.

విశాఖలో ఏటిజి టైర్ల పరిశ్రమ దగ్గర్నుంచి ఎన్నో విదేశీ సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం సైతం పరిశ్రమల స్థాపనకు పలు రాయితీలు ప్రకటిస్తూనే వాళ్లకు అన్నివిధాలా సహకారం అందిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్నారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో దేశంలోనే ఏపీ నంబర్ -1 లో నిలిచింది. ఏడ్చేవాళ్ళు ఏడవనీ… నవ్వేవాళ్ళు నవ్వనీ … నా గమనం.. పయనం మాత్రం ప్రగతిపథం వైపే అంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు సాగుతూ ఉంది.

Previous Post

వాట్ ఏ స్పీచ్ జగన్ సాబ్…

Next Post

పేదరికం తగ్గుతోంది… నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి

Next Post
పేదరికం తగ్గుతోంది… నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి

పేదరికం తగ్గుతోంది... నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్  అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్
movies

టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

by admin
April 3, 2026
0

...

Read more
ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

March 31, 2026
మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన  హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

March 29, 2026
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో   జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్   ఈ నెల 28న

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్ ఈ నెల 28న

March 27, 2026
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

March 27, 2026
వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

March 23, 2026
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

March 21, 2026
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In