రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్
హీరో సంజోష్ శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్కు చెందిన అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే గ్యాస్ స్టవ్ను బహూకరించి, అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.
“ఇకపై మీరందరూ నా చెల్లెళ్లే. మీకు ఏ అవసరం వచ్చినా నా వంతు అండగా ఉంటాను” అంటూ వారికి మాట ఇచ్చారు.
ఇప్పటికే శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిల కోసం రెండు సార్లు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఫ్రిజ్ డొనేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
ఇది మాత్రమే కాదు… ఇప్పటివరకు 250 మందికి మొబైల్ ఐ క్యాంప్స్ ద్వారా క్యాటరాక్ట్ సర్జరీలు, 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు. అలాగే 3 మంది విద్యార్థుల చదువు బాధ్యతను స్వయంగా తీసుకున్నారు.
వరంగల్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో మంచి ఫ్యామిలీ కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే… తన వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో సేవా కార్యక్రమాలు చేస్తున్న హీరో సంజోష్ను అభినందిద్దాం.









