త్వరలో గవర్నర్ కోటాలో ఏపీలో భర్తీ చేయనున్న రెండు MLC స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రెండు MLC స్థానాలను టీడీపీ అభ్యర్థులకే ఇస్తున్నట్టు ఓ వైపు ప్రచారం సాగుతున్నా… ఒక వేళ బీజేపీ అధినాయకత్వం పట్టుబడితే మాత్రం బీజేపీ అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. సాధారణంగా గవర్నర్ కోటాలో నియమించే MLC లను కూటమిలోని అందరి ఆమోదంతో రిజల్యూషన్ పాస్ చేసి గవర్నర్ కు పంపుతారు. అయితే ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థుల ఎంపికకు ఇలాంటి ప్రక్రియ ఏదీ జరగలేదు. గతంలో బీజేపీకి గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వనున్నట్టు టీడీపీ నుంచి హామీ కూడా ఉందని తెలుస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ విశాఖ పర్యటనలో కి విషయం సీరియస్ గా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో ఖచ్చితంగా బీజేపీ ప్రాతినిధ్యం ఉంటుందని నబిన్ పార్టీ నేతలకు తెలిపినట్లు సమాచారం.
ఇప్పటికే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, అలాగే అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం కి చెందిన రమాదేవికి MLC స్థానాలను కేటాయించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. పైకి చెబుతున్నట్టు గా 2 గవర్నర్ కోటా MLC ల లో …ఒకటి బీజేపీ కి …ఒకటి టీడీపీ కి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.









