భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ స్టోర్ అయిన లాడియా (LADIA), తన 6వ బ్రాంచ్ను నెల్లూరులో ఘనంగా ప్రారంభించింది. “వజ్రాలు అందరికీ సొంతం” అనే నినాదంతో, నమ్మకమైన మరియు వినూత్నమైన డిజైన్లను లాడియా అందిస్తోంది.
నెల్లూరులో ఏర్పాటు చేసిన ఈ నూతన షోరూమ్ను ప్రముఖ సినీ నటి మానస వారణాసి వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరు, సాత్విక తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరు మాట్లాడుతూ.. “ల్యాబ్-గ్రోన్ డైమండ్ రంగంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఆ ప్రయాణంలో భాగంగా, సరికొత్త ఐడియాలతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆభరణాలకు పెట్టింది పేరైన నెల్లూరులో మా 6వ స్టోర్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.
ఏమిటి ఈ ల్యాబ్-గ్రోన్ డైమండ్స్?
ల్యాబ్-గ్రోన్ వజ్రాలను అత్యాధునిక సాంకేతికతతో ప్రయోగశాలల్లో తయారు చేస్తారు. ఇవి చూడటానికి, నాణ్యతలో మరియు మెరుపులో సహజమైన వజ్రాలతో సమానంగా ఉంటాయి. సహజ వజ్రాలకు ఇచ్చే రంగు మరియు క్లారిటీ గ్రేడింగ్నే వీటికి కూడా ఇస్తారు.
లాడియా ప్రత్యేకతలు:
అద్భుతమైన కలెక్షన్స్: హారాలు, వడ్డాణాలు, నెక్లెస్లు, గాజులు, పెండెంట్లు, బ్రాస్లెట్లు, కమ్మలు, జుంకాలు, ఉంగరాలు మరియు ప్రత్యేకమైన ల్యాబ్-గ్రోన్ పోల్కీ ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి.క
స్టమైజేషన్: మీకు నచ్చిన డిజైన్ను మీరే సొంతంగా తయారు చేయించుకోవచ్చు.
సర్టిఫికేషన్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన IGI సంస్థ ద్వారా సర్టిఫై చేయబడిన వజ్రాలు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి
సరసమైన ధరలు: క్యారెట్ వజ్రం ధర కేవలం రూ. 24,999 (EF – VVS) నుండే ప్రారంభం
బంపర్ ఆఫర్…
స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏప్రిల్ 04 నుండి ఏప్రిల్ 19, 2026 వరకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు:
వజ్రాల ధర మరియు మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 15% తగ్గింపు
జీరో వేస్టేజ్ (No Wastage) సౌకర్యం. అద్భుతమైన వజ్రాల ప్రపంచాన్ని చూడటానికి ఈరోజే నెల్లూరులోని లాడియా స్టోర్ను సందర్శించండి!










