ఎన్నికలు దగ్గరపడేకొద్ది టీడీపీ రౌడీ రాజకీయం మొదలుపెట్టింది. ఓటమి భయంతో టీడీపీ దాష్టికాలకు దిగుతోంది. ఈ ఎన్నికల్లో అన్ని సర్వేలు వైయస్ జగన్ దే విజయం ఘంటా పథంగా చెబుతుండటంతో టీడీపీ పార్టీ భరించలేకపోతోంది. మంగళగిరిలో నారా లోకేష్ కూడా ఓడిపోతున్నాడని సర్వేల్లో తేలడంతో వైసీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నాడు నారా లోకేష్ అండ్ బ్యాచ్. నిన్న రాత్రి ప్రచారంలో ఉన్న మేకా వెంకటరెడ్డిపై టీడీపీ గూండాలు దాడి.. తీవ్రంగా గాయపరిచారు. దాంతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయాడు. నీ రాజకీయ దాహానికి ఇంకెంత మంది అమాయకుల్ని బలిచేస్తావ్ లోకేష్.? అని మంగళగిరి ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటే వారికి వేస్తారు. అలా వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి అంతే తప్ప… వారిపై దాడులకు దిగడం ఏంటని వాపోతున్నారు. ఇలాగే జరిగితే మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు.