టీడీపీ-జనసేన పొత్తు ఎట్టకేలకు పొడిచింది. ఓ వైపు జగన్ వరుసబెట్టి అభ్యర్థులను కొత్త నియోజకవర్గాలకు ఇంఛార్జిలుగా నియమిస్తూ పోతుంటే… ఉక్కిరిబిక్కిరి అయిన చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్… ఈరోజే ఎట్టకేలకు అత్తెసరు జాబితాతో ప్రజల ముందుకు వచ్చారు. అయితే చంద్రబాబు మళ్ళీ తన సహజనైజాన్ని బయటపెట్టుకున్నారు. చెప్పేదొకటి.. చేసేదొకటి… బయటకు ఎన్ని చెప్పినా.. ఎన్ని నీతులు మాట్లాడినా చివరగా తనకు, తన పార్టీకి లబ్ది చేకూరేలా మాత్రమే పొత్తులు ఉండాలన్నది అయన కాన్సెప్ట్. ఇదే క్రమంలో ఇన్నాళ్లుగా జనసేనలో పొత్తు అంటూ పవన్, కాపుల బలాన్ని వాడుకునేందుకు ప్లాన్ వేసిన చంద్రబాబు జాబితా ప్రకటనరోజు తన నిజరూపాన్ని బయటపెట్టారు. తొలి విడతలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశానికి 94 సీట్లు… జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. ఇక్కడే అసలు మతలబు ఉంది.. తెలుగుదేశం వాటాకింద వచ్చిన 94 స్థానాలకూ అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించారు.. కానీ జనసేన వాటాలోని 24 సీట్లలో కేవలం ఐదుగురిని మాత్రమే పేర్లు ప్రకటించారు.. ఇంకో 19 స్థానాల్లో ఎవరు ఉంటారన్నది తేల్చలేదు.. అంటే అక్కడ కూడా చంద్రబాబు సూచించినవాళ్లనే జనసేన తరఫున పోటీ చేయిస్తారా అన్నది తెలియాలి. ఇక జనసేన, టీడీపీ కూటమి 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారో చూడాలి… ఏదిఏమైనా పవన్ కళ్యాణ్ కు … కాపులకు చంద్రబాబు మరోసారి పోటు పొడిచినట్లే క్యాడర్ భావిస్తోంది. ఇదిలా ఉండగా టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు.. అచ్చెన్నాయుడు.. లోకేష్, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.. కానీ జనసేన తరఫున ఐదుగురి పేర్లు చెప్పినా అందులో పవన్ పేరు లేదు.. అంటే అయన ఎక్కడ పోటీ చేస్తారన్నది చెప్పలేదు.. చెప్పుకోలేదు.. ఆఖరుకు సేనాని పవన్ కళ్యాణ్ తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో పొత్తుకు సిద్ధమై… చంద్రబాబుకు తలొగ్గారని జనసైనికులు, పార్టీ మద్దతుదారులు ఆవేదన చెందుతున్నారు