• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రచిత్ శివ పతాకంపై పాలిక్ శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం

admin by admin
April 24, 2024
in movies
0 0
0
రచిత్ శివ పతాకంపై పాలిక్ శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఐ.ఐ.టి.కృష్ణమూర్తి ఫేం యువ హీరో పృథ్వీ హీరోగా రూపాలి, అంబిక హీరోయిన్లుగా…రచిత్ శివ, ఆర్.ఆర్.క్రియేషన్స్ అండ్ పాలిక్ స్టుడియోస్ పతాకాలపై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం బుధవారం లాంచనంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దుర్గం రాజేష్, రావుల రమేష్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పాలిక్ శ్రీను. సంగీతం జాన్ భూషన్ అందించగా సురేష్ గంగుల పాటల రచయిత. వెంకట్, నిశాంత్ నిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిషాంత్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టి… టీమ్ ను అభినందించారు.

ఈ సందర్భంగా సీనియర్ నటి ఆమని మాట్లాడుతూ… ఈ చిత్రంలో నేను ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నా. లవ్ అండ్ సెంటిమెంట్ ఎమోషనల్ కామెడీ మూవీ. ఇది గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో అజయ్ ఘోష్ సరసన నేను నటిస్తున్నా. నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్ తో తీస్తున్నారు. దర్శకుడు పాలిక్ చెప్పిన కథ నాకు బాగా నచ్చి ఈ చిత్రం చేస్తున్నా అన్నారు.

హీరోయిన్ అంబిక, రూపాలి మాట్లాడుతూ… ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు తొలి తెలుగు సినిమా. దర్శకుడు, నిర్మాతలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి… ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. స్క్రిప్ట్ నచ్చి ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇంతకు ముందు హిందీ, మరాఠి చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. ఇది లవ్, రొమాంటిక్, సెంటిమెంట్, కామెడీతో ప్రధానంగా తెరకెక్కుతోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకునికి ధన్యవాదాలు అన్నారు.

హీరో పృథ్వీ మాట్లాడుతూ… మా డైరెక్టర్ పాలిక్ ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాని తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకి ధన్యవాదాలు. త్వరలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాం అన్నారు.

నిర్మాత దుర్గం రాజేష్ మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున్న నిర్మించడానికి రావుల రమేష్, టి.ఎస్.రాజులతో కలిసి ముందుకు వచ్చాం. దర్శకుడు పాలిక్ తో కలిసి ప్రొడక్షన్ నెం.3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులు అలరించేలా ఈ చిత్రాన్ని యువ నటీనటులతో తెరకెక్కిస్తున్నాం. హీరో పృథ్వీని తెలంగాణ నుంచి, హీరోయిన్లను బాలీవుడ్ నుంచి, మళయాలం నుంచి అనిరుధ్ ని విలన్ గా… ఇలా అన్ని ప్రాంతాల నుంచి అందరి ఆర్టిస్టులను తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం అన్నారు. నిర్మాత, దర్శకుడు భరద్వాజ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఆయనకు ధన్యవాదాలు అన్నారు.

నిర్మాత రావుల రమేష్ మాట్లాడుతూ… ఇటీవలే కాలకేయ ప్రభాకర్ తో కలిసి రౌద్రరూపాయ నమ: చిత్రాన్ని విడుదల చేశాం. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. థియేటర్లు సరిగా దొరకలేదు. కేవలం 70 థియేటర్లలో మాత్రమే విడుదల చేయగలిగాం. ఈ చిత్రానికైనా ఎక్కువ థియేటర్లు లభిస్తాయని ఆశిస్తున్నా అన్నారు.

సంగీత దర్శకుడు మాట్లాడుతూ… ఇందులో ఐదు పాటలు కంప్లీట్ అయ్యాయి. దర్శకుడు పాలిక్ ఎంతో ఎంకరేజ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ… ఇది నాకు ఇది మూడో చిత్రం. నాకు కొరియోగ్రాఫర్ గా మంచి పేరుంది. ఇటీవల రిలీజ్ అయిన రౌద్రరూపాయ నమ: చిత్రానికి మంచి పేరు వచ్చింది. మంచి రేటింగ్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు ఎప్పటి నుంచో స్వాతిముత్యం లాంటి ఓ మంచి కుటుంబకథా చిత్రం తీయాలని ఉంది. నా మిత్రుడు ఎస్.ఆర్.పి. ఇచ్చిన కథ నచ్చి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వివిధ పాత్రలకోసం నటీనటులను తీసుకున్నాం. తెలుగులోని ప్రధాన తారాగణం అంతా కూడా ఇందులో నటిస్తున్నారు. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇందులో ఆమని, ఝాన్సీ లు చాలా వెయిటేజ్ ఉన్న పాత్రలు చేస్తున్నారు. వచ్చే నెల 25 నుంచి చ సెట్స్ మీదకు వెళుతుంది. మంచిర్యాలలో ఓ పాటను తీస్తున్నాం. ఐదు షెడ్యూల్స్ లో సినిమాని పూర్తి చేసి… దిపావళికి సినిమాని విడుదల చేస్తున్నాం అన్నారు.

నటీనటులు: పృథ్వీ, రూపాలి, అంబిక, ఆమని, ఝాన్సీ, అజయ్ ఘోష్, జీవా, షకలక శంకర్, సుమన్, ఆర్.ఎస్.నంద, సుమన్ శెట్టి, సూర్య, చిత్రం శీను, అనిరుధ్, రఘు, సింగ్ సిద్ధూ తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:

నిర్మాతలు: దుర్గం రాజేష్, రావుల రమేష్, టి.ఎస్.రాజు
కథ-డైలాగ్స్-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పాలిక్ శ్రీను
సంభాషణలు: తోటపల్లి సాయినాథ్
సంగీతం: జాన్ భూషన్
పాటలు: సురేష్ గంగుల
సినిమాటోగ్రఫీ: వెంకట్, నిశాంత్
కొరియోగ్రఫీ: పాలిక్, మహి
ఎటిటర్: నిశాంత్
కో-డైరెక్టర్: రంగనాయకులు
ప్రొడక్షన్ మేనేజర్: సూర్య
పి.ఆర్.ఓ.: చందు రమేష్

Previous Post

ఇంద్రాణి నుంచి ‘నేనే రావణ’ పాట విడుదల

Next Post

టీడీపీ విజయాన్ని ఆపలేరు; బండారు శ్రావణి

Next Post
టీడీపీ విజయాన్ని ఆపలేరు; బండారు శ్రావణి

టీడీపీ విజయాన్ని ఆపలేరు; బండారు శ్రావణి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’
movies

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

by admin
September 3, 2026
0

...

Read more
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

August 31, 2026
మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

August 30, 2026
యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

August 29, 2026
విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే  దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

August 29, 2026
రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

August 28, 2026
శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

August 28, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In