ఏపీలో పెట్టుబడుల వరద పారుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల కారణంగా పెట్టుబడులు పెట్టడానికి బడా కంపెనీలు మొగ్గుచూపుతున్నాయనేదానికి ఇదే పెద్ద ఉదాహరణ. పెట్టుబడుల కోసం గతేడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయులు కుదుర్చుకున్నాయి. యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి… ఎంతో చొరవ తీసుకుని పెద్ద పెద్ద కంపెనీలకు ఏపీకి ఆహ్వానిస్తున్నారు. ఏపీలో పెట్టుబడుల పాలసీలు చాలా సరళంగా ఉండేలా వైయస్ జగన్ తీసుకున్న చర్యల కారణంగా పెట్టుబడి దారులకు ఏపీ సర్గధామంలా మారింది. ఇప్పటికే అనేక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి.
తాజాగా కోరమాండల్ కంపెనీలో కాకినాడలో రసాయనాలను ఉత్పత్తి చేయడానికి దాదాపు రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ సెక్రెటరీ బి.షణ్ముగ సుందరం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కంపెనీ ఫాస్పొరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్స్ ను కాకినాడలో ఏర్పాటు చేయనుంది. దీని వల్ల కాకినాడ మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది.