ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ కి మరోసారి పట్టంకట్టడానికి ఏపీ ఓటర్లు సిద్ధం అయ్యారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేపట్టని సంక్షేమం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే చేశారు వైయస్ జగన్. సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి న్యాయవాదుల వరకు అన్ని వర్గాల వారికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైయస్ జగన్ కే దక్కింది. ఓ వైపు సంక్షేమం… మరోవైపు అభివృద్ధి రెండూ కొనసాగించడంతో ఏపీ ప్రజలు మరోసారి జగన్ నే ముఖ్యమంత్రిని చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఏ జాతీయ మీడియా సర్వే చేసినా… వైయస్ జగన్ యే కాబోయే ముఖ్యమంత్రి అని తెలుస్తోంది. మొన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తనకున్న సమాచారం మేరకు జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా ఎ.ఎల్.ఎన్.(ఆంధ్ర లైవ్ న్యూస్).. ఏపీలో మార్చి 20 నుంచి ఏప్రిల్ 20వ తేదీ మధ్య సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ యావరేజ్ గా 550 మందిని సర్వే చేయగా… వైసీపీకి 51 శాతం మంది మొగ్గు చూపగా… టీడీపీ కూటమి వైపు 41 శాతం మంది మొగ్గుచూపారు. అలాగే ఇండియా కూటమి వైపు 4 శాతం మంది మొగ్గు చూపగా… ఇతరుల వైపు మరో నాలుగు శాతం మంది మొగ్గుచూపారు. ఈ లెక్కన వైయస్ ఆర్ సీపీకి 149 సీట్లు, తెలుగుదేశం కూటమికి కేవలం 26 సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వే ప్రకారం తేలింది. అంతే కాదు… ఒక్కో నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలవచ్చనేది కూడా ఇందులో తేలిపోయింది. వైసీపీకి 10 వేలకు పైగా మెజారిటీతో గెలిచే సీట్లు 79 ఉండగా… 5 నుంచి 10 మధ్య మెజారిటీతో గెలిచే సీట్లు 57 ఉన్నాయి. 5 వేల లోపు మెజారిటీతో గెలిచే సీట్లు 13 ఉన్నట్లు ఆ సర్వే పేర్కొంది. ఈ సర్వేలో మొత్తం 90604 మంది పాల్గొన్నారు.
ALN Survey by Andhra Live News.
Sample size: average 550 samples per constituency.
YCP: 51%
TDP+: 41%
INDIA: 4%
Others + Undecided: 4%
YCP: 149 || TDP+: 26
YCP
10k + majority – 79 seats
5k to 10k – 57 seats
0 to 5k – 13 seats