• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

admin by admin
September 4, 2026
in movies, politics
0 0
0
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

▪️ అక్టోబర్ 1 నుంచి 5 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు సభలు
▪️ ధ్యానం, అహింస, శాకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు మహాసభలు
▪️ వివరాలు వెల్లడిస్తూ నిర్వాహకుల ప్రెస్ మీట్
▪️ రోజా రమణి, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ హాజరు

హైదరాబాద్: అహింసా భావనను సమాజంలో విస్తృతంగా పెంపొందించడంతో పాటు జీవుల పట్ల కరుణ, దయ, శాకాహారం, ధ్యానం ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ నిర్వహిస్తున్నట్లు నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్ తెలిపారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్, నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి.

ఈ మహాసభలకు సంబంధించిన ముందస్తు మీడియా సమావేశం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ప్రముఖ సీనియర్ నటి రోజా రమణి, సినీ రంగానికి చెందిన ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ లోగో, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రముఖ నటుడు ఉపేంద్ర, బాబా రాందేవ్, మేనకా గాంధీ తదితర ప్రముఖులు ఇటీవల లోగో ఆవిష్కరించిన దృశ్యాలను ఈ సమావేశంలో ప్రదర్శించారు.

‘అహింసా కుంభమేళా’గా నిర్వహిస్తున్నాం
ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. హింస జరగకూడదనే, జంతువులను చంపకూడదనే భావనతో హైదరాబాద్‌లో ‘అహింసా కుంభమేళా’ను నిర్వహిస్తున్నామని తెలిపారు. మాంసాహారం మానవ జాతికి పట్టిన పీడగా ఆయన అభివర్ణించారు. మానవాళిలో అహింస, శాకాహారంపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు జీవుల పట్ల దయ, కరుణను పెంపొందించడం ఈ మహాసభల ప్రధాన ఉద్దేశమన్నారు.

ధ్యానం, అహింస, శాకాహారం ద్వారా ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవన విధానాన్ని ప్రజల్లో ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో అహింసా భావనను మరింత బలోపేతం చేయడంతో పాటు శాకాహారం ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు ప్రముఖ నటుడు ఉపేంద్ర, బాబా రాందేవ్, మేనకా గాంధీ తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆచార్య శ్రీనివాస్ వెల్లడించారు.

‘శ్రీనివాస్ దంపతులు వండర్ కపుల్’
ప్రముఖ సీనియర్ నటి రోజా రమణి మాట్లాడుతూ.. ఆచార్య శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత పత్రీజీ నిర్వహించిన సభలకు తాను వెళ్లానని, ఆ కార్యక్రమాలకు భారీగా ప్రజలు హాజరయ్యేవారని గుర్తుచేశారు. ఆచార్య శ్రీనివాస్, ఆయన సతీమణి కలిసి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు.

ఈ దంపతులను తాను ‘వండర్ కపుల్’ అని పిలుస్తానని రోజా రమణి అన్నారు. ఆచార్య శ్రీనివాస్ సంకల్పం ఎంతో గొప్పదని, మూగజీవుల ఆశీస్సులు ఆయన దంపతులపై ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే ప్రజలు ఈ ఉద్యమానికి ఇంత అద్భుతంగా స్పందిస్తూ సభలకు హాజరవుతున్నారని చెప్పారు. ధ్యానం, శాకాహారం మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవుల పట్ల కరుణ, దయ కలిగి ఉండాలని, అహింసను జీవన విధానంగా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ అహింస, శాకాహారం, జీవకరుణ వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని రోజా రమణి కోరారు. అక్టోబర్ 1 నుంచి 5 వరకు జరిగే ఐదు రోజుల మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఆరోగ్యకరమైన జీవనశైలికి ధ్యానం, శాకాహారం

ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆచార్య శ్రీనివాస్ ప్రారంభించిన ఈ సంకల్పం ఎంతో గొప్పదని, దీనికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని అన్నారు. ప్రస్తుత కాలంలో షుగర్, బీపీ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు సాధారణమైపోతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ కార్యక్రమం ఒక మంచి యజ్ఞం వంటిదని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, శాకాహారం ఎంతో ఉపయోగకరమని చెప్పారు. సమాజంలో అహింస, జీవకరుణ, శాకాహారంపై మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఐదు రోజుల పాటు జరిగే మహాసభలకు ప్రజలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రెస్‌మీట్‌లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్, నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ ప్రతినిధులు, సభ్యులు, నిర్వాహకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అహింస, జీవకరుణ, ధ్యానం, శాకాహారం సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్వాహకులు కోరారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్‌తో పాటు సురేందర్ బండారి, సంబశివ రావు, సునీత, గీత యాదవ్, సంగీత బాబు తదితరులు పాల్గొన్నారు.
—

Previous Post

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

Next Post

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Next Post
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits
movies

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

by admin
September 4, 2026
0

...

Read more
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

August 31, 2026
మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

August 30, 2026
యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

August 29, 2026
విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే  దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

August 29, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In