ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మతితప్పి పిచ్చోడిలా మాట్లాడుతున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆందోళన బొత్స ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాజధాని అమరావతి శ్మశానం అయితే కాటి కాపరి ఎవరో చెప్పాలన్నారు. బొత్స బరువు కాదు..అహంకారం తగ్గించుకోవాలన్నారు. జగన్ అవినీతిని హార్వర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీగా పెట్టిందని కూన రవికుమార్ వ్యాఖ్యానించారు.