కృష్ణా జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్పై అధికారులు కొరడా ఝులిపించారు.అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న ప్రైవేటు బస్సులపై అధికారులు 42 కేసులు నమోదు చేశారు.ఐదు రోజులుగా గరికపాడు, పొట్టిపాడు, కీసర టోల్ప్లాజాల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.తనిఖీల్లో 6 బస్సులను సీజ్ చేసి, 295 కేసులు నమోదు చేశారు. అధిక ధరలు వసూలు చేసిన ఒక్కో బస్సుకు అధికారులు రూ.25వేల జరిమానా విధించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశామని కృష్ణా జిల్లా డీటీసీ పేర్కొన్నారు.